WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వరంగల్ రోడ్డుపై నిలిపి ఉన్న బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగర శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో బ్యాటరీలను తరలిస్తున్న దొంగలను పట్టుకున్నట్టు వెల్లడించారు. బ్యాటరీల విలువ సుమారు రూ. 60,000 ఉంటుందని పేర్కొన్నారు.