NRML: నర్సాపూర్ మండలం చాకెపల్లి గ్రామంలో సోమవారం ఈత వనం కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ సీఐ నజీర్ హుసేన్ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ జాదవ్ వెంకటి, గౌడ కులస్తులు పాల్గొన్నారు.