MBNR: మహబూబ్ నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారిని ఆయన సన్మానించారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు ఎక్కువ స్థానాలు గెలిపించారని చెప్పారు.