BDK: పినపాక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం కలిశారు. నియోజకవర్గంలో ఉన్న మౌలిక వసతుల సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎంకి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు.