MBNR: జడ్చర్ల పట్టణంలో నేటి మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ సందర్భంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి పట్టణంలోని నాగర్ కర్నూలు రోడ్డు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక ప్రజలతో కలిసి జేసీబీపై తిరుగుతూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.