MDCL: ఉప్పల్, మౌలాలి, నాచారం ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు తవ్వి మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టితో ప్రయాణం కష్టంగా మారి తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.