MBNR: బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీహరి ఆరోపించారు. శనివారం అడ్డాకులలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామం,వార్డుల్లో ప్రజలు సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.