ఖమ్మం జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవరావు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.