MNCL: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం మండలాల రైతులకు వరప్రదాయనిగా ఉన్న సదర్ మాట్ కాలువ నుండి నీటిని విడుదల చేయనున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సదర్ మాట్ నుండి ఖానాపూర్, కడెం మండలంలోని పలు గ్రామాల రైతుల పొలాలకు సాగునీరు అందుతుంది. యాసంగి సీజన్లో రైతుల పొలాలకు జనవరి 2 నుండి ఏప్రిల్ 17 వరకు వారాబంది పద్ధతిలో సాగునీటినీ విడుదల చేయనున్నారు.