JN: చిల్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వంట గదిని పరిశీలించి,ఆహార తయారీ విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అనే విషయం గురించి ఆరా తీశారు. భోజన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.