KNR: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దయతోనే సురక్షితంగా ఉన్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కోరుట్ల వద్ద మంత్రి కారును మరో వాహనం ఢీకొట్టగా మంత్రి కారు ముందు చక్రం ఊడిపోయింది. ఈ సంఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో అందరం సురక్షితంగా ఉన్నామని, ఇది 2వ సారి జరిగిన రోడ్డు ప్రమాదమని, ప్రజలకు సేవ చేసే భాగ్యం వల్లే చల్లగా ఉన్నానన్నారు.