SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని సర్పంచ్ బూరెల్లి శంకర్రావు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు తెలిపారు. ఆదివారం పంచాయతీలోని లచ్చుమన్నపేటలో పంచాయతీ నిధులు 3 లక్షల రూపాయలు వెచ్చించి రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోటి యాభై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు.