అన్నమయ్య: పెనగలూరు మండలంలోని నారాయణ నెల్లూరుకు శనివారం బస్సు సర్వీసును పునరుద్ధరించారు. ఈ సందర్భంగా డీఎం జీ.రమణయ్య మాట్లాడుతూ ఉదయం 7 గంటలకు, సాయంత్రం 4 గంటలకు నారాయణనెల్లూరు సర్వీసు నడుపుతామని తెలిపారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుసర్వీసును వినియోగించుకోవాలని సూచించారు.