KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయ సభా భవనంలో ఈనెల 30న సోమవారం ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ భీమనపల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదిస్తారని ఆమె పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా సమావేశంలో పాల్గొనాలని కోరారు.