ఖమ్మం: నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. వరి పంట వైపు మాత్రమే రైతు మొగ్గు చూపకుండా లాభసాటి పంటల సాగు జరిగేలా చూడాలని చెప్పారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తనకు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని, రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు.