జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని వాల్మీకి దేవాలయం దగ్గర ఉన్న కల్వర్టు వంతెనను మూసివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కోరారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. కల్వర్టు ప్రమాద భరితంగా ఉందని వాహనదారులు గుంతలోపడే అవకాశం ఉందని, దీన్ని వెంటనే పూడ్చాలని పేర్కొన్నారు.