NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన మహిపాల్ ఓ ఛానెల్లో కెమెరా మెన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అలీసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.