జనగామ: ప్రభుత్వ నిషేధిత అంబర్, గుట్కాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీదేవి తెలిపారు. తరిగొప్పులలోని ఓ కిరాణ దుకాణంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.13వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని దుకాణ నిర్వాహకుడు నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు