ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,060గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,070గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే ఇవాళ సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ ధర రూ.30 తగ్గినట్లు వెల్లడించారు.