NRPT: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల విధులకు జిల్లా వ్యాప్తంగా 74 మంది ఎన్నికల సిబ్బంది విధులకు గైర్హాజరు అయ్యారని అన్నారు.