SRPT: విద్యుత్ మోటార్లను దొంగిలిస్తున ఇద్దరు నిందితులను హుజూర్ నగర్ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు విద్యుత్ మోటార్లను దొంగలించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు.