SRCL: వేములవాడ పట్టణానికి చెందిన జాహ్నవి తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ విడుదల చేసిన ఫలితాలలో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వేములవాడ పట్టణానికి చెందిన జాహ్నవి ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవిద్యను పూర్తిచేసుకుంది. వేములవాడ బార్ అసోసియేషన్లో సభ్యురాలుగా కొనసాగుతుంది. ఆమెకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.