పల్నాడు: పెదకూరపాడులోని స్థానిక కచేరి సెంటర్లో విద్యుత్ పోలుకు వైర్లు పిచ్చుక గూడులా అల్లుకుపోయి ఉన్నాయని స్థానిక ప్రజలు తెలిపారు. త్రీఫేస్ లైన్లో పదుల సంఖ్యలో విద్యుత్ వైరు ఉండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వినియోగదారులు తెలిపారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకల వలన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ జరిగితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.