అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కోహ్లీ అనుకుని అతని అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
ఇటీవల వివాహం చేసుకున్న పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో వివాహంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది. షోయబ్ పెళ్లిపై సానియా టీమ్, కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి.. పాక్ నటి సనా జావేద్ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
మూడో టీ20లో ఆఫ్గానిస్థాన్తో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు సిద్ధం కావడమే ఉంది. అయిదు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్లో భారత ఆటగాళ్లు పాల్గొంటారు. అయితే ఈ ఏడాది జూన్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
ఉత్కంఠపోరులో భారత్ నెగ్గింది. గెలుపోటములతో పెద్దగా ఆసక్తిలేని మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఈ పోరులో రోహిత్ శర్మతో భాగస్వామ్యంగా చెలరేగిన రింకు సింగ్ ఆటపై రోహిత్ ప్రశంసలు కురిపించారు. కష్టసమయంలో భారత్కు రింకు లాంటి ఆటగాడు అవసరం అని కితాబిచ్చాడు.
భారత్ టెన్నీస్ ఆటగాడు సుమీత్ నాగల్ దశ తిరిగింది. ఒకే ఒక్క విజయంతో ఈ ఆటగాడు కోటీశ్వరుడయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో తన కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న ఆటగాడిని ఓడించడంతో సుమీత్ నాగల్ జాక్పాట్ కొట్టాడు.
కర్ణాటకలోని ఓ యువ క్రికెటర్ పరుగుల వరద పారించాడు. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రకార్ చతుర్వేది అనే ఈ యువ బ్యాటర్ కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. ముంబైతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 404 పరుగులు చేశాడు. 46 ఫోర్లు 3 భారీ సిక్సర్లు బాదాడు. చతుర్వేది 638 బంతుల్లో 404 పరుగులు చేశాడు
ఇటీవల వన్టేలకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20 లు ఆడుతున్నారు. తాజాగా ఆయన ఓ మ్యాచ్ కోసం గ్రౌండ్లో హెలికాప్టర్తో దిగారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
తొలి టీ20 మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. భారత బౌలర్లు సరైన రీతిలో తమ ప్రదర్శనను చూపడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో టీమిండియా తొలి టీ20లో విజయం సాధించింది.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య నేటి నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ తిరిగి వచ్చాడు. 14 నెలల తర్వాత టీ20లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని టీమ్లోకి తీసుకోవడం తెలివైన నిర్ణయమని సురేష్ రైనా వ్యాఖ్యానించాడు.