ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ జరిగే లీగ్ ఆఖరి మ్యాచులో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ ముంబై వేదికగా మ.3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సెమీస్కు చేరనుండగా.. ఓడిన టీమ్ ఇంటిబాట పడుతుంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన 57 మ్యాచుల్లో 22- 34 తేడాతో భారత్పై న్యూజిలాండ్దే పైచేయిగా ఉంది.