కొరియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ పోటీలలో భారత్ సత్తా చాటుతోంది. ఈ పోటీలలో భారత్ 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్వర్ణతోపాటు మరో పతకం కైవసం చేసుకున్నారు.
ఐపీఎల్ లోకి త్వరలోనే ఏపీ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకోసం ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తోంది. వచ్చే ఏడాది బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది.
24 గ్రాండ్స్లామ్ టైటిల్స్, 8వ వింబుల్డన్ టైటిల్ కోసం ఆడిన నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు నిన్న షాక్ ఎదురైంది. 20 ఏళ్ల స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జకోవిచ్ను మట్టికరిపించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్నాడు.
ఆసియా గేమ్స్లో ఈసారి టీమిండియా క్రికెట్ టీమ్ పాల్గొనబోతోంది. అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ కూడా జరగనుంది. దీని వల్ల కొందరు ఆటగాళ్లు ఆసియా గేమ్స్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. ఆసియా గేమ్స్కు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది.
91 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనత భారత జట్టు చేసింది. 1932లో టీమిండియా తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడిన నుంచి నేటి వరకు ఇదే అతిపెద్ద వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023(Asian Athletics 2023)లో నిన్న ఇండియా తరఫున మరో ఇద్దరు తజిందర్పాల్ సింగ్, పరుల్ చౌదరి బంగారు పతకాలు గెలుచుకున్నారు. దీంతో ఇండియాకు వచ్చిన పతకాలు 9కి చేరాయి.
ఇండియా, వెస్టిండీస్(india vs west indies) మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ తన 81వ బంతికి బౌండరీ కొట్టి నవ్వుతూ ఆ క్షణాన్ని ఆస్వాదించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
థాయ్లాండ్లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో రెండో రోజైన గురువారం భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలను గెలుచుకున్నారు. దీంతోపాటు కాంస్య పతకం కూడా కైవసం చేసుకున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కూడా ఉండటం విశేషం.