ఒమన్లో జరుగుతున్న హాకీ పురుషుల జూనియర్ ఆసియా కప్లో యువ భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్ గ్రూపు దశను అజేయంగా ముగించింది. సౌత్ కొరియాపై 1-8 తేడాతో విజయం సాధించింది. అర్ష్దీప్ మూడు, అరైజీత్ రెండు గోల్స్తో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. గుర్జోత్, రోసన్, రోహిత్ చెరో గోల్ చేశారు. ఈ నెల 3న జరిగే సెమీస్లో మలేసియాతో యువ భారత్ తలపడనుంది.