ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. గిల్ (5), శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), అక్షర్ పటేల్ (7) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తిలక్ వర్మ (0) డకౌట్గా వెనుదిరిగాడు. హేజిల్వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఒక వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ (34), హర్షిత్ రాణా (1) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు స్కోరు 50/5.