ఆసియా కప్ విజయాన్ని పంజాబ్ వరద బాధితులకు అంకితమిస్తున్నట్లు భారత హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ తెలిపాడు. ప్రతి బాధితునికి.. అవసరంలో ఉన్నవారిని రక్షించడానికి కృషి చేస్తున్న నిస్వార్థ స్వచ్ఛంద సేవకులకు అంకితమని చెప్పాడు. కాగా, జలంధర్ శివారులోని మిథాపూర్లో గ్రామంలో జన్మించిన మన్ప్రీత్.. ఆసియా కప్లో భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.