ఛాంపియన్స్ ట్రోఫీలో మార్చి 4(మంగళవారం) నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మార్చి 4న దుబాయ్ వేదికగా జరిగే తొలి సెమీస్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మార్చి 5న పాకిస్థాన్ వేదికగా జరిగే రెండో సెమీస్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది. కాగా, అన్ని మ్యాచ్లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.