టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లీని 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు వాళ్లు ఫామ్లో లేకపోతే జట్టులో ఉండటం కష్టమని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్, కోహ్లీ కంటే మెరుగైన బ్యాటర్లున్నారా?.. లేరు కాబట్టి వారిని జట్టులోంచి తప్పించాలని చూడొద్దు’ అని చెప్పుకొచ్చాడు.