భారత్, శ్రీలంక T20 వరల్డ్ కప్-2026కు ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టోర్నీని ఫిబ్రవరి 7 నుంచి మార్చ్ 8 నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. టోర్నీ భారత్లోని అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై.. లంకలోని క్యాండీ, కొలంబోతో మరో వేదికలో జరుగుతుందని క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే ఫైనల్ అహ్మదాబాద్లో జరగనున్నట్లు తెలుస్తోంది.