అంకాపూర్ (Ankapur ) నాటు చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకల చికెన్ ఐటమ్మ్ ఉన్నా ఈ నాటు కోడి కూర రుచే వేరు. భోజన ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armour) మండలం అంకాపూర్లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్తో తన ప్రస్థానాన్ని ...
ఎవరూ ఔనన్నా కాదన్నా తెలంగాణ (Telangana) అంటే కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao).. కేసీఆర్ అంటేనే తెలంగాణ. తెలంగాణ తెచ్చింది.. ఇప్పుడు పాలిస్తున్నది కేసీఆర్. ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన కారణజన్ముడుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను భావిస్తున్నారు. అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ (Delhi) ప్రభుత్వాన్ని గజగజ వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్.
ఈ రోజుల్లో ఎక్కువ మందికి గుండె జబ్బులు( Heart Diseases) వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కొందరు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్(Heart attack)తో ప్రాణాలు వదులుతున్నారు. జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఆరోగ్యం తీవ్రంగా నాశనమవుతోంది. అందుకే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల( Heart Diseases)ను నివారించొచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు (February 14') ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఆరోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు (Valentine's Day) వాలెంటైన్స్ డే జరుపుకొంటారు.
నేటి రోజుల్లో చాలా మంది అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది స్థూలకాయం, డయాబెటిస్(Diabetes), బీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మనం తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి తీవ్రంగా హాని కల్గిస్తున్నాయి. అందుకే పరిమితంగానే వాటిని తీసుకోవడం మంచిది.
నేటి రోజుల్లో మంచి ఆహారం(food) తీసుకోవడంలో అందరూ వెనకబడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వింటర్ సీజన్ ముగుస్తోంది. ఇక వేసవి సీజన్ దగ్గర పడుతోంది. మారుతున్న సీజన్కు అనుగుణంగా మనం కొన్ని రకాల ఆహారాలు(food) తీసుకోవాలి.
ఛత్తీస్గఢ్లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. తన బిడ్డ అంత్యక్రియల కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తూ రెండురోజుల పాటు ఓ తల్లి ఇళ్లిళ్లూ తిరిగింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన కాంకేర్ జిల్లా మలంజికుండంలో చోటు చేసుకుంది. మన్సుగవాడే అనే మహిళకు లక్ష్మణ్తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టాక మన్సుగవాడే అనారోగ్యానికి గురయింది. భర్త చికిత్స చేయించేందుకు ...
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది.కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా…లేక రైట్ టైమ్ కే వస్తారా అన్న అంశంపై రచ్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తే లేటేస్టుగా కేటీఆర్ పుల్ క్లారిటీ ఇచ్చారు.పైగా బాల్ బీజేపీ కోర్టులో వదిలారు. ముందుస్తుపై బీఆర్ఎస్ -బీజేపీ మద్య సవాళ్లలో కాంగ్రెస్ కూడా సై అంటోందా? తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుం...
నిరుపేద కుటుంబం పుట్టి ఓ యువతి ఉన్నత శిఖరం చేరింది. పట్టుదలతో కష్టపడి చదివి జడ్జి అయ్యింది. అది కూడా అతి చిన్న వయసులోనే జడ్జిగా మారి యువతకు ఆదర్శమైంది. ఓ నిరుపేద కూతురు గాయత్రి 25 ఏళ్లకే కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు జడ్జిగా నియమితురాలైంది. బెంగళూరులోని విధానసౌధం ఎదురుగా కర్ణాటక హైకోర్టు ఉంది. ఆ కోర్టులో సివిల్ జడ్జీల పోస్టులకు ఆన్లైన్లో ప్రత్యక్ష పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు కోలారు జిల్లా ...
ఈ రోజుల్లో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. వాస్తు శాస్త్రానికి అమితమైన శక్తి ఉంది. మన ఇంట్లో చేసేటటువంటి అన్ని పనులకు, మంచి చెడులకు వాస్తు శాస్త్రం ఎంతో ముఖ్యమైనది. ఇంటి నిర్మాణం నుంచి మన ఇంట్లో మనం అమర్చే వస్తువుల వరకూ అంతా కూడా వాస్తు శాస్త్రం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఏ దిశలో కూర్చోవాలి, ఏ దిక్కున కూర్చోని తినాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. కొంత మంది […]
నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...
తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...
కమ్యూనిస్ట్లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు ఉండగా, చివరగా డిసెంబర్ నెలలో తెలంగాణలో జరగనున్నాయి. మరో పది నెలలు ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తనను తాను జాతీయ నేతగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా గట్టెక్కా...