షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సోనియాగాంధీ సుముఖంగా ఉన్నారని టీ కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.
విశాఖలో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాల భూమి కొనొచ్చని ఏపీ మంత్రి అమర్ నాథ్ అన్నారు.
పాట్నాలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ పాలనా తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం భూముల విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. రక్షణశాఖ భూములను కావాలని అంటోంది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మంత్రి కేటీఆర్ కలిసి విన్నవించారు. స్కై వేకోసం ఆ భూమి కావాలని.. అదే రేటు ఉన్న మరో చోట భూమి ఇస్తామని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేంధర్ ఫైరయ్యారు. ప్రజల సొమ్ముతో భవనాలు నిర్మిస్తే.. సొంత డబ్బులతో నిర్మించినట్టు కలరింగ్ ఇస్తారెంటీ అని మండిపడ్డారు.
వైఎస్ఆర్టిపి(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తన పార్టీని అందులో విలీనం చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.
రెండు సార్లు ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు అమరుల లెక్కలు చెప్పిన కేసీఆర్.. వచ్చిన తర్వాత వాళ్ల లెక్కలు లేవంటున్నారని విమర్శించారు.
ఏపీలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఆరోపించారు. కోనసీమ హింసాకాండలో 250 మంది యువకులపై కేసులు ఎత్తివేయాలని సీఎం, డీజీపీకి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అమలాపురం వారాహి విజయయాత్రలో ప్రసంగించారు
అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కోనసీమ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా నేడు అమలాపురంలో బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అన్న మాటలను గుర్తుచేశారు.
అన్నయ్య చిరంజీవి మాట వినాలని, అదే మీకు మంచిదని జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మంత్రి రోజా సూచించారు.
ఆసియాలో అతి పెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం సంగారెడ్డి జిల్లాలో జరుగుతోంది. కొల్లూరులో ఓకేచోట 15,660 ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి ముఖ్య నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీలో ఏం జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.