ప్రధాని (prime minister of india) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM Kisan) స్కీమ్ కింద భారత ప్రభుత్వం రూ.16,800 కోట్లను విడుదల చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy) సోషల్ మీడియా (Social Media) అనుసంధాన వేదిక ట్విట్టర్ (Twitter)లో కొనియాడారు.
గుంటూరు జిల్లాలో రైతు భరోసా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, అసలు వాస్తవాలను దాచి, తామేదో చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పించింది.
దాడికి పాల్పడిన వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభపై దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకుని పోతా
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
ts bjp leaders met amith shah:తెలంగాణ బీజేపీ నేతలు హస్తినలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీశ్ సిసోడియా (manish sisodia) అరెస్ట్ తర్వాత.. వారు దేశ రాజధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) ఆరోపణలు వచ్చాయి.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సరికొత్త సవాల్ విసిరారు.
రాష్ట్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తున్నదని నిలదీశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. . ప్రకృతితో పాటు మానవుల రూపంలో వారికి అన్యాయం జరుగుతున్నది. పండించిన పంటను మార్కెట్ కు తీసుకువెళ్లితే ధర వెక్కిరిస్తోంది. ఆహార ధాన్యాలతో పాటు వాణిజ్య పంటలు, కూరగాయలకు ఈ పరిస్థితి ఎదురవుతున్నది.
సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ(Kushboo)కు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ప్రస్తుతం ఖుష్బూ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం ఆమెను నియమించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు, సినీ ప్రముఖులు ఖష్బూ(Kushboo)కు ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా తన కోస్టార్ అయిన ఖుష్బూకు శుభా...
once again chief minister:ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పారు. ఆ దేవుడు తనను దీవించాడని.. అర్థం చేసుకోవాలని కోరారు. మంచి మనసుతో చేసే పరిపాలనను ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని అన్నారు. అందుకే వర్షాలు సమృద్దిగా పడుతున్నాయని పేర్కొన్నారు.
Telangana News : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ తో మొదలైన వైరం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ పర్యటనలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ , ఫ్లెక్సీలను ఇంకా తీయలేదని కాంగ్రెస్ శ్రేణులు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి. దీనిపై ప్రతిపక్షాలు సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పర్యటన సమయంలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. కానీ ఈసారి వైసీపీ మరింత రెచ్చిపోయి చివరకు మొక్కజొన్న కంకులకు కూడా పార్టీ రంగులు (YCP Colors) వేయడం గమనార్హం.
డొక్కు వాహనం తనకు వద్దని మంచి కండిషన్ లో ఉన్న వాహనం కేటాయించాలని రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆయన చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి తాజాగా ఇన్నోవా వాహనం కల్పించింది. అయితే ఈ వాహనం కూడా పాతదే. 2017 మోడల్ కావడం గమనార్హం. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ వాహనం ఏదైనా పర్లేదు. కానీ మంచి కండీషన్ లో ఉంటే చాలని పేర్కొన్నాడు.
ఎలగైన తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ (BJP)సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మిషన్ 90తో వ్యూహాలను రచించిన బీజేపీ ...నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోతెలంగాణ ముఖ్యనేతలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah).. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు.
Ayyanna Pathrudu : టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో ఊహించని షాక్ తగిలింది. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.