నా కూతురు చదువు ఆగిపోతుంది అని ప్రభావతి వాపోయింది. ఇది విన్న చంద్రబాబు చలించిపోయారు. ‘మీ అమ్మాయి చదువుకు ఎంత కావాలమ్మా?’ అని చంద్రబాబు అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ నాయకుల సహాయంతో రూ.2.3 లక్షలు సేకరించి వైసీపీ కార్యకర్త అయిన ప్రభావతికి అందించారు.
భజరంగ్ దళ్ ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా హనుమాన్ ఆలయాలను నిర్మిస్తామని డీకే శివకుమార్ ప్రకటించారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సైపై మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదనే కామెంట్పై స్పందించారు.
మణిపూర్లో హింస చల్లారడం లేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది.
ఏపీలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు తాను సీఎం కావాలని అనుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో హాస్య నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. మంత్రి సుధాకర్ తరఫున ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు.
కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఏడీఆర్ నివేదిక అందరికి షాకిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేవారిలో మొత్తం 404 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది.
మధ్యప్రదేశ్ బబల్ పూర్లో భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డిని బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ ఆహ్వానించారు. పొంగులెటి ఇంటికెళ్లగా.. అక్కడికి జూపల్లి కృష్ణారావు కూడా వచ్చారు.
గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం రెండో లైన్ పేరును రాత్రికి రాత్రి ఫాతిమా నగర్ అని కార్పొరేషన్ సిబ్బంది మార్చారు. స్థానికులు ఆ బోర్డును చించి.. తమ పాత పేరుతో మరో బోర్డును ఏర్పాటు చేసుకున్నారు.
న్యూఢిల్లీ వసంత్ విహార్లో గల బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
గిరిజన, గిరిజనేతరుల ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఈశాన్య రాష్ట్రంలో ఘర్షణలపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం. పొంగులేటితో ఈటల బృందం చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేసింది. పార్టీలో అన్ని నాకు తెలిసి జరగాల్సిన పని లేదు. పార్టీలో ఎవరి పని వాళ్లు చేసుకుంటారు.
విద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదన మా వద్ద లేదు. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా పార్టీ కట్టుబడి ఉంది.
అరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా (MLAs) పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore District) చోటుచేసుకున్న పరిణామాలే సాక్ష్యం. ముగ్గురు కీలకమైన ఎమ్మెల్యేలు, జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న నేతలు పార్టీపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసింద...