బండి సాయి భగీరథ్కు స్టేషన్ బెయిల్ వచ్చింది. మహీంద్రా వర్సిటీలో తోటి విద్యార్థిపై బండి భగీరథ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ బుధవారం రోజున దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఆయనకు షరతులతో కూడిన స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దాడికి సంబంధించి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి విచ...
బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్...
కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటించిన వారిసు.. తమిళ్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా.. అజిత్ ‘తునివు’ సినిమాకు పోటీగా జనవరి 11న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ అందుకుంది. అయితే తెలుగులో జనవరి 13న రిలీజ్ అయిన వారసుడు పెద్దగా సౌండ్ చేయలేదు. అయినా మంచి కలెక్షన్లే రాబడుతున్నాడట. ఇదిలా ఉంటే.. వారసుడు సినిమాలో 10 కోట్లు ఖర్చు పెట్టి తీ...
తెలుగు నేలపై జన్మించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఒక్కో నేతది ఒక్కో స్టైల్ పాలిటిక్స్. ఒకరు ప్రధాని పదవీ చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి కాగా, మరొకరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, అధికారం చేపట్టారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన నేత మరొకరు. ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఆ ముగ్గురు పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలుగు రాష్...
ఇటీవల నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 72 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరగడానికి కొద్ది సెకన్ల ముందు విమానంలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇప్పటికే ప్రజలు వీడియో రూపంలో బయటకు వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆ వీడియో బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సోను జైస్వాల్ అనే వ్యక్తి ఫోన్ […]
ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పోరేటర్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అద్భుతంగా పోరాడుతున్నారని, ఈ పోరాటం తెలంగాణ నుండే ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ బీజేపీకి వ్యతి...
తెలుగుదేశం కేవలం ఓ పార్టీ మాత్రమే కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆ...
ప్రభాస్ నటిస్తున్నఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.. 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే టీజర్లో గ్రాఫిక్స్ చూసిన నెటిజన్స్.. దర్శకుడిపై మండిపడ్డారు. ఇదేం గ్రాఫిక్స్.. ఇదేం సినిమా.. అని తేల్చేశారు. దాంతో ఎప్పటిలాగే మరోసారి ఆదిపురుష్ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 12 నుంచి జూన్ 16కి వాయిదా వేశాడు. వీఎఫ్ఎక్స్ బెటర్మెంట్ కోసం మరింత సమయం క...
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల ఎమ్మెల్యేలను మార్చాలని అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను అలా అనలేదని మంత్రి క్లారిటీ ఇస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. తన మాటలను మార్చారని పేర్కొన్నారు. కష్టపడాలని చెబితే.. మార్చాలని అన్నట్టు వక్రీకరించారని మండిపడ్డారు. తాను అలా అనలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 80 సీట్లు పక్కగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు ఉండగా, చివరగా డిసెంబర్ నెలలో తెలంగాణలో జరగనున్నాయి. మరో పది నెలలు ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తనను తాను జాతీయ నేతగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా గట్టెక్కా...
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మీనారాయణ రావుకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగిన మరుసటి...
సినిమా, రాజకీయం పరంగా ఏ విషయమైనా హాట్ టాపిక్ అయ్యింది అంటే చాలు.. ఆ విషయం గురించి స్పందించే వారిలో కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ అందరికంటే ముందుంటారు. ఆ విషయం తనకు సంబంధించిందా.. లేదా అని పట్టించుకోకుండా.. హాట్ టాపిక్ అయితే చాలు తల దూరచేస్తారు. తాజాగా.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఇష్యూలో కూడా వర్మ ట్వీట్ చేశాడు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ని ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కొడుకుతో పోల్చుతూ ...
విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ల విషయంలో చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. నాని సోదరుడు చిన్నికి విజయవాడ టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చిన్ని సహా మరో నలుగురికి టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని ఇటీవల నాని స్పష్టంచేశారు. ఓ సందర్భంలో విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగుతానని నాని సంకేతాలను ఇచ్చారు. అక్కడినుంచి తాను పోటీ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకట...
తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను దగ్గరుండి సీఎం కేసీఆర్ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ విశేషాలను వారికి వివరించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందివ్వగా.. అర్చకులు ప్రత్యేక అశీర్వచనాలు అందించారు. అంతకుముందు ప్రగతిభవన్...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 10,000 వేలకు పైగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విడతలవారీగా చేపట్టనుంది. మొత్తం 5 శాతం ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా తదితర కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్ ఈ తొలగింపు ప్రక్రియను బుధవారం న...