• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాజీ ప్రధాని మృతిపై ఎమ్మెల్యే సంతాపం

ATP: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సమాచారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కు తెలియడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మరణ వార్త విన్న నా మనసు తీవ్రంగా కలచి వేసిందని మన దేశానికి ఎన్నటికీ తీరనిలోటు అని ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు.

December 27, 2024 / 06:49 AM IST

ఈనెల 28 మున్సిపల్ సమావేశం

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మున్సిపల్ సాధారణ సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్ .రామారావు ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్సన్ సభ్యులు, అధికారులు హాజరవ్వాలని కోరారు.

December 27, 2024 / 06:49 AM IST

‘పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధకనబరచాలి’

PPM: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మండల విద్యా శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ ఎంఈవోలతో సమీక్షించారు. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని అన్నారు.

December 27, 2024 / 06:48 AM IST

నార్కొటిక్స్ బలోపేతానికి కార్యాచరణ

HYD: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(TGANB) ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. కేవలం మాదకద్రవ్యాల సంబంధ కేసుల కోసమే ఏర్పాటైన ఈ విభాగం కార్యకలాపాలు అన్ని జిల్లాల్లో కొనసాగేలా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు రీజియన్లను గుర్తించి నార్కొటిక్స్ కంట్రోల్ సెల్స్‌ను ఏర్పాటు చేశారు.

December 27, 2024 / 06:46 AM IST

కంప్యూటర్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం

కాకినాడ: స్థానిక భానుగుడి సెంటర్‌లోని సైస్ కంప్యూటర్ సెంటర్‌లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ జె.బాబి తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, సీఎస్ఆర్ పథకంలో శిక్షణ ఇస్తామన్నారు. ట్యాలీ, కంప్యూటర్ అసిస్టెంట్, రిటైల్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 30లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9299907346 సంప్రదించాలన్నారు.

December 27, 2024 / 06:46 AM IST

నేటి నుంచి ‘సీఎం కప్‌-2024’ పోటీలు

TG: రాష్ట్రస్థాయి సీఎం కప్-2024 పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2 తేదీ వరకు ఈ క్రీడలు కొనసాగుతాయి. రాష్ట్రస్థాయిలో 36 విభాగాల్లో క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా విభాగాల్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచినవారు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి.

December 27, 2024 / 06:45 AM IST

ప్రమాదానికి గురైన బస్సు, లారీలో డీజిల్ స్వాహా

GNTR: వినుకొండ శివారులో ఆర్టీసీ బస్సులో దుండగులు డీజిల్ చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మండలంలోని ఏ.కొత్తపాలెం శివారులో ఆర్టీసీ బస్సు-మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు, లారీలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం వినుకొండ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలు అక్కడే ఉన్నాయి.

December 27, 2024 / 06:45 AM IST

మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

WG: మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కొవ్వూరు మండలం వాడపల్లిలో గురువారం జరిగింది. వాడపల్లిలో ఓ పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. బాధితురాలు మైనర్ కావడంతో ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడైన పాస్టర్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

December 27, 2024 / 06:43 AM IST

రైతుల పొట్ట కొట్టొద్దు ఇంటూరి: బుర్రా

ప్రకాశం: చేపల మాయలో పడి రాళ్ళపాడు ఆయకట్టు రైతుల పొట్ట కొట్టవద్దని మాజీ MLA బుర్రా, MLA ఇంటూరి నాగేశ్వరరావును ఉద్దేశించి అన్నారు. గురువారం కందుకూరు YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాళ్ళపాడు ప్రాజెక్ట్ సమస్యను తాను రాజకీయం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు.

December 27, 2024 / 06:42 AM IST

నాయుడుపేటలో మోస్తరు వర్షం

NLR: నాయుడుపేటలో రాత్రి 10 గంటల నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. విశాఖపట్నం వాతావరణ శాఖ సూచన మేరకు ఇప్పటికే అన్ని పోర్టల్ నందు అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

December 27, 2024 / 06:42 AM IST

ఇంటికెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి

మేడ్చల్: మూడుచింతల పల్లి కొల్తూరుకు చెందిన గణేశ్ (25) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం.. గురువారం సాయంత్రం డ్యూటీ అనంతరం బైక్ పై ఇంటికి వెళుతున్నాడు. శామీర్ పేట PS పరిధిలో కేశవరం సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

December 27, 2024 / 06:40 AM IST

ఈనెల 31న సాధారణ సమావేశం

KKD: పెద్దాపురం పురపాలిక పాలక మండలి సర్వసభ్య సమావేశం ఈనెల 31న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పద్మావతి అన్నారు. ఛైర్‌పర్సన్ తులసీ మంగతాయారు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ సమావేశానికి విధిగా కౌన్సిల్ సభ్యులు, ఆయా విభాగాల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

December 27, 2024 / 06:39 AM IST

YVU పీజీ పరీక్షల తేదీల్లో మార్పులు

KDP: ఈనెల 30 నుంచి జరగాల్సిన యోగి వేమన యూనివర్సిటీ, అనుబంధ పీజీ కళాశాల మొదటి సెమిస్టర్ పరీక్షలు 2025 జనవరి 21వ తేదీ నుంచి జరుగుతాయని ప్రిన్సిపాల్ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేశామన్నారు. MA, Mcom, Msc, Mped పస్ట్ సెమిస్టర్ల విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

December 27, 2024 / 06:37 AM IST

నేడు కేంద్ర కేబినెట్ భేటీ

కేంద్ర కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అయితే గురువారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఇవాళ అధికారిక కార్యక్రమాలను కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించింది.

December 27, 2024 / 06:35 AM IST

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 31వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేటలోని యల్లమంద గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై గురువారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

December 27, 2024 / 06:32 AM IST