• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా వాసులు

JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన వంశీ, మెట్‌పల్లిలోని వర్షకొండ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న జెట్టిపల్లి అశోక్ ఎంపికయ్యారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో గత ఆదివారం జరిగిన సెలెక్షన్ అండ్ ట్రయల్స్‌లో సీనియర్ పురుషుల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి వీరు జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ టీంకు ఎంపికయ్యారు.

December 27, 2024 / 07:07 AM IST

నవంబర్ 14న బాలల దినోత్సవం రద్దు?

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏటా జరుపుకొనే నవంబర్ 14 బాలల దినోత్సవం రద్దుపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సంబంధంలేని రోజును బాలలకు అంకితం చేశారని.. డిసెంబర్ 26న వీరబాల దివస్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 2022లోనే జాతీయస్థాయిలో ఈ ఆలోచన వచ్చిందని.. ప్రధాని మోదీ ఆమోదంతో బాలల దినోత్సవాన్ని మారుస్తామని వెల్లడించారు.

December 27, 2024 / 07:05 AM IST

గౌరవ వేతనాల్లేని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు

PLD: జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు కొన్ని నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. ఫలితంగా వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. మార్చి గౌరవ వేతనం చెల్లించినా ఏప్రిల్ నుంచి రావడం లేదని, ఎంపీటీసీ సభ్యునికి రూ.3 వేలు, జెడ్పీటీసీ సభ్యునికి రూ.6 వేలు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి గ్రాంటు విడుదల కావాల్సి ఉందని, సిఎఫ్ఎంఎ అధికారులు పేర్కొంటున్నారు.

December 27, 2024 / 07:05 AM IST

ముమ్మాటికి శేషయ్యపై తప్పుడు కేసే: కాకాణి

నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నేత వెంకట శేషయ్యను జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం జైలుకు వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకట శేషయ్య యాదవ్ ఎదుగుదలను ఓర్వలేక సోమిరెడ్డి కుట్రపన్ని, కేసులో ఇరికించారన్నారు. శేషయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో తప్పుడు కేసు బనాయించారన్నారు.

December 27, 2024 / 07:03 AM IST

ముమ్మాటికీ అది తప్పుడు కేసే: కాకాణి

నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నేత వెంకట శేషయ్యను జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం జైలుకు వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకట శేషయ్య యాదవ్ ఎదుగుదలను ఓర్వలేక సోమిరెడ్డి కుట్రపన్ని, కేసులో ఇరికించారన్నారు. శేషయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక, పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో తప్పుడు కేసు బనాయించారన్నారు.

December 27, 2024 / 07:03 AM IST

కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: సీఐ

KKD: రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎక్కడైనా పేకాట, గుండాట వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగ్గంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం గతంలో కోడిపందాలు నిర్వహించిన జగ్గంపేట శివారు బాలాజీ నగర్ దగ్గరలో ఉన్న మర్రిపాక గ్రామానికి చెందిన కోడిపందెం బరులను పరిశీలించారు.

December 27, 2024 / 07:03 AM IST

జనవరి10 వరకు SC కుల గణన పై సోషల్ ఆడిట్

PPM: జిల్లాలో ఎస్సీ కొలకలపై జనవరి 10వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అయన మాట్లాడుతూ.. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన తదుపరి డిసెంబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరణ జరుగుతుందని అన్నారు. అభ్యంతరాలు ఉంటే వీఆర్వో స్వీకరిస్తారని వీటిని మూడు దశలో తనిఖీ చేస్తారని అయన తెలిపారు.

December 27, 2024 / 06:59 AM IST

మాజీ ప్రధాని మృతి పట్ల ఎమ్మెల్యే యశస్విని సంతాపం

JN: మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసిన ఆయన సేవలు అపారమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ వంటి మహా నాయకుడు ఈ లోకాన్ని విడిచిపోవడం దేశానికి తీరని నష్టమని అన్నారు.

December 27, 2024 / 06:57 AM IST

‘విద్యుత్ ఛార్జీల పెంపుపై నేడుపోరుబాట’

VSP: విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంబంధిత పార్టీ సమన్వయకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

December 27, 2024 / 06:57 AM IST

10 రోజుల పాటు VIP దర్శనాలు రద్దు: TTD

AP: 10 రోజుల పాటు VIP దర్శనాలను రద్దు చేస్తూ TTD నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఆ 10 రోజులూ చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, NRI వంటి వారికి కూడా దర్శనాలు ఉండవని పేర్కొంది. ఆ 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపింది.

December 27, 2024 / 06:55 AM IST

‘సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కలిసిన గ్రామస్థులు’

ADB: బోథ్ మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

December 27, 2024 / 06:54 AM IST

KU డిగ్రీ రీఅడ్మిషన్‌కు మరో అవకాశం: ప్రిన్సిపల్

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్య అభ్యసిస్తూ విద్యా సంవత్సరం పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసిన విద్యార్థులు 2, 4, 6వ సెమిస్టర్లలో రీ అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జనవరి 3లోగా కళాశాలలో సంప్రదించి కాకతీయ విశ్వవిద్యాలయం రీ అడ్మిషన్ అనుమతి పొంది విద్యను కొనసాగించవచ్చన్నారు.

December 27, 2024 / 06:53 AM IST

28న కైకలూరులో ఉద్యోగ మేళా

W.G: కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్.జితేంద్ర గురువారం తెలిపారు. వరుణ్ మోటార్స్, మెడ్స్ ఫార్మసీ వంటి సంస్థల్లో 100 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పదో తరగతి ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మశీ అర్హులు.

December 27, 2024 / 06:49 AM IST

మాజీ ప్రధాని మృతిపై ఎమ్మెల్యే సంతాపం

ATP: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సమాచారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కు తెలియడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మరణ వార్త విన్న నా మనసు తీవ్రంగా కలచి వేసిందని మన దేశానికి ఎన్నటికీ తీరనిలోటు అని ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు.

December 27, 2024 / 06:49 AM IST

ఈనెల 28 మున్సిపల్ సమావేశం

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ మున్సిపల్ సాధారణ సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్ .రామారావు ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్సన్ సభ్యులు, అధికారులు హాజరవ్వాలని కోరారు.

December 27, 2024 / 06:49 AM IST