E.G: జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో రాజమండ్రిని అగ్రగామిగా నిలపాలని రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదును యజ్ఞంలా నిర్వహించాలని అన్నారు.
BHPL: చిట్యాల(M) నవాబుపేట గ్రామానికి చెందిన PACS మాజీ డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సతీమణి రమ క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఈ రోజు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. BRS నేతలు ఉన్నారు.
NLR: నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక గురువారం జరిగింది. దేవరకొండ సుజాత పేరును 40వ డివిజన్ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. పోటీ లేకపోవడంతో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను అధికారికంగా ప్రకటించారు.
RR: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో BJP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా OBC మోర్చా నాయకుడు బోయిని మహేష్ యాదవ్ MPకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ నలంద కళాశాలలో మార్చి 1న ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కుమారి పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు పొందవచ్చు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. సమాచారం కోసం 9494149416 నంబర్కు సంప్రదించాలని వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, చిన్నారి మృతిపై జిల్లా SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతుండగా, నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సున్నితమైన అంశంపై ఆసక్తి నెలకొంది.
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి రామగిరి మండల పోలీస్ వసతులపై చర్చించారు. రామగిరిలోని ఎస్సై, సిబ్బంది క్వార్టర్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు. పోలీస్ స్టేషన్ ఆధునీకరణ, కాంపౌండ్ వాల్, రోడ్డు సౌకర్యాల కోసం రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.
SDPT: మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శివోల సతీష్ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల గృహ ప్రవేశంలో ప్రారంభోత్సవంలో సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ఎన్నో సంవత్సరాలు సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంత ఇంటి కల పేదలకు నెరవేరింది.
NDL: మహానంది క్షేత్రంలో కర్నూలు జిల్లా కన్ఫ్యూమర్ కోర్టు జడ్జి జస్టిస్ కరణం కిషోర్ కుమార్ ఏపీ లోకాయుక్త సీసీ అమరేంద్ర రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి ఘనంగా స్వాగత పలికారు. శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందిశ్వరస్వామిని దర్శించుకుని అభిషేకాలు కుంకుమార్చనలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. క్రిమినల్ లా ప్రాక్టీస్ లో కనీసం 7 ఏళ్ల అనుభవం, సెషన్స్ కేసులు నిర్వహించిన వారు అర్హులన్నారు.
నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో రాబోతున్న ‘బ్లడీ రోమియో’పై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం కోసం ముగ్గురు సంగీత దర్శకులను తీసుకోవాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడట. యాక్షన్, రోమాన్స్, డ్రామా ఎమోషన్స్కు తగ్గట్టుగా ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్లోనే ఇలా మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం విశేషం.
JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధర్మకర్తలు చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు మరింగంటి రామకృష్ణాచార్యులు తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయి.
NLG: అఖిల భారత బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షులు రామావత్ భీమా నాయక్ 9వ వర్ధంతి సందర్భంగా దేవరకొండలోని బంజారా భవనంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని భీమా నాయక్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సమాజం కోసం భీమా నాయక్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.
MHBD: రైన్య తండా గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతుల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. పంట పక్వానికి వచ్చే సమయంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం కారణంగా మొక్కలు నేలకు ఒరిగిపోయాయి. చాలా చోట్ల నీరు నిలిచి పంట మునిగిపోయింది. రైతులు పంట నష్టం భరించలేక ఆందోళన చెందుతున్నారు
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారు సింహ ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి ఉత్సవ మూర్తిని యోగ నారాయణస్వామి రూపంలో అర్చకులు అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత సింహ వాహనంపై శ్రీవారిని కొలువుదిర్చి పురవీధుల్లో ఊరేగించారు.