AP: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దాడి జరిగిందని వచ్చిన ఆరోపణలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు క్లారిటీ ఇచ్చారు. సోము వీర్రాజు మంత్రి కాదని, ఆయనకు సమాధానం చెప్పే అధికారం లేదని ఛైర్మన్ స్పష్టం చేశారు. వైసీపీ సభ్యలు వెల్లో ఉండగా.. సోము వీర్రాజు కూడా పోడియం దగ్గరకు వచ్చారని తెలిపారు. సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు దాడికి యత్నించలేదని వెల్లడించారు.
WGL: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. రెండో రోజు పరీక్షలో జనరల్ మొత్తం 4821 విద్యార్థులకు గాను 4705 హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 744 విద్యార్థులకు గాను 713 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించారు.
KDP: బద్వేల్ నియోజకవర్గం కలసపాడు(మం) పెళ్లి మర్రి చెక్ డాం సమీపంలో గురువారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కలసపాడు నుంచి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తూ.గో: నల్లజర్ల మండలంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇవి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలను వెంటనే వినియోగంలోకి తెచ్చి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వనపర్తి జిల్లాలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కో-ఆర్డినేటర్ సీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించారు. శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్లయ్య హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క పేషెంట్కు దాదాపు రూ.7,000 టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు .
CTR: పాలసముద్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థుల అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పాల్గొని “ధైర్య స్పర్శ” పోస్టర్ను ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వాతో కలిసి ప్రారంభించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KRNL: గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని డిప్యూటీ ఎంపీడీవో జయరాముడు అన్నారు. గురువారం పెద్దకడబూరులో పన్నుల వసూళ్లపై ఆయన అవగాహన కల్పించారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పన్నులు సమయానికి చెల్లిస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.
NLG: కేరళలోని కుట్టిక్కానంలో జరిగిన జాతీయ సమగ్రత శిబిరం(NIC)లో NSS వాలంటీర్ కె.తరుణ్ ప్రతిభచాటారు. ఈ నెల 17 నుంచి 23 వరకు మహాత్మా గాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో తెలంగాణ ప్రతినిధిగా తరుణ్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.
AP: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబలకుండా మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సురక్షిత నీరు అందించేలా ఎస్వోపీ జారీ చేసింది. మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితమైతే కమిషనర్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైప్లైన్లు తనిఖీ చేయాలని ఆదేశించింది. డ్రైనేజీల్లో నీరు నిలవకుండా వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది.
BPT: వయోజన విద్యా కార్యక్రమాలను వేగవంతం చేసి ‘అక్షరాంధ్ర’ లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం వయోజన విద్యా కార్యక్రమాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి 4న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సత్యసాయి: హిందూపురంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు చట్టం 1861 సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత, రాజకీయాలకు అతీతంగా సోషల్ మీడియా పోస్టులు చేసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలోని కీలక సన్నివేశంలో NTR షర్ట్లెస్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ఫైట్ సీక్వెన్స్లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాగా కాకుండా పూర్తిగా న్యూ స్టైల్లో ఉంటాయని టాక్. ఇక ఈ మూవీని 2026 జూన్ 25న విడుదలవుతుంది.
ATP: తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో తోటలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ. 82,500 నగదు, ఒక మోటార్ సైకిల్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
GDWL: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలను ప్రారంభించింది. గద్వాల డిపోలో డీఎం సునీత, లాజిస్టిక్స్ ఏటీఎం బద్రి నారాయణ పోస్టర్లు విడుదల చేశారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృథ్వీరాజ్ (9154298609)ను సంప్రదించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
JN: రఘునాథపల్లి గ్రామంలో VOA భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భూమి పూజ చేశారు. సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.