KMR: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 9,572 మంది విద్యార్థులకు గాను 9,258 మంది హాజరయ్యారని, 314 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
TPT: వెంకటగిరి-ఏర్పేడు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి ఏర్పేడు వైపు వస్తున్న కారు దుగ్గిపేరి వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని అంబులెన్సులో తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. పౌష్టికాహారం, టీకాలు ఇస్తూనే వారిని గ్యాడ్జెట్స్కు దూరంగా ఉంచి శారీరక ఆటలను ప్రోత్సహించాలి. ప్రతిరోజూ వారితో సమయం గడుపుతూ, వారి భావాలకు గౌరవం ఇవ్వాలి. ప్రేమ, క్రమశిక్షణల మధ్య సమతుల్యత పాటిస్తూ, అపరిచితుల పట్ల జాగ్రత్తలు నేర్పాలి. ఒత్తిడి లేని వాతావరణంలో పెంచుతూ వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.
PPM: మన్యం జిల్లాలో చేపట్టబోయే జనగణన 2027 ప్రక్రియను నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మండల అధికారులకు పిలుపునిచ్చారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. గడువు వరకు వేచి ఉండకుండా ముందస్తు ప్రణాళికతో పని చెయ్యాలన్నారు.
KMR: దోమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మొదటి సంవత్సర ఇంగ్లీష్-I (సెట్–C) పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 140 మంది విద్యార్థులకు 136 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 116 మంది విద్యార్థులకు 115 మంది, వొకేషనల్ విభాగంలో 24 మందికి గానూ 21 మంది పరీక్ష రాశారు. నలుగురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ఓల్డ్ చెకోపోస్ట్ వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా SP నీతికా పంత్ శుక్రవారం ప్రారంభించారు. SP మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు CC కెమెరాలు మూడవ కన్నులా పనిచేస్తాయని తెలిపారు. ఒక్క CC కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని పేర్కొన్నారు.
SRD: కంగి మండలంలోని ముర్కుంజాల్లో సర్పంచ్ సారంగి అనుష ఆహ్వానం మేరకు, లయన్స్ క్లబ్ ఖేడ్ శాఖ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఓ ఆసుపత్రి బృందం గ్రామస్థులకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయి రెడ్డి, సాయ గౌడ్, లాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులుగా శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ కార్యక్రమంలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్తో సహా 12 గ్రామాల సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం-2018పై అవగాహన కల్పించారు. నేటితో ఓరియంటేషన్ శిక్షణ ముగియనుంది.
ADB: బోథ్ మండలంలోని కౌట బీ గ్రామంలో గల శ్రీ శబరిమాత ఆశ్రమంలో జరుగుతున్న 14వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శబరిమాత భక్తులు ఎక్కువగా ఉన్నారని, ప్రజలు ఎల్లప్పుడూ ఇలాగే శాంతి, భక్తి మార్గంలో నడవాలని అన్నారు.
TG: లిక్కర్ స్కాం కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు సీబీఐ కోర్టు క్లిన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తాను చెప్పిందే నిజమని కోర్టు తీర్పుతో తేలిందని కవిత అన్నారు. తనను 5 నెలలు జైలులో ఉంచి మానసికంగా వేధించారని ఆవేదన చెందారు. తప్పు తేలకుండా నా వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అన్నదాన సత్రాన్ని శుక్రవారం ఆలయ ఈవో దామోదర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అన్న ప్రసాదం తయారీ, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. పరిశుభ్రత మరియు నాణ్యత విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నప్రసాదానికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి తెలిపారు.
KMM: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ముదిగొండ పోలీస్ సిబ్బంది తెలిపారు. శుక్రవారం మేడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల అనర్ధాలపై విద్యార్థులకు యువత తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సైలు హరిత, అశోక్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.
E.G: మార్చి 2026లో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్లో ఉన్న వివరాల సవరణకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. రేపటి వరకు సవరణలకు అవకాశం ఉందన్నారు. విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 5వ రోజు అయిన శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ, బాటని, ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1538 మంది హాజరు కావాల్సి ఉండగా 1372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1500 మంది రాయాల్సి ఉండగా 1377 మంది విద్యార్థులు రాశారు.
MDCL: నేరేడ్మెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న 9 వైన్స్ దుకాణాపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు, మల్కాజ్గిరి ఎస్హెచ్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ దుకాణాల వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిలో పేర్కొన్నారు. వినతి ఇచ్చిన వారిలో వీ.ప్రసన్న నాయుడు, కే. గీతామూర్తి, జే.అంజలి దేవిలు ఉన్నారు.