ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఆదివారం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం నూతన జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ నాణ్యత గల జనరిక్ మందులు లభించే విధంగా భారతీయ జన ఔషధీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.
కోనసీమ: ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోధైర్యం లభిస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం మొదలైన ఆత్రేయపురం లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో పట్టణంలో సాగుతున్న రోప్ లైట్ పనులను మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చింబిలి వెంకటరమణ పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాళ్ల ఉమామహేష్, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
NZB: ఆర్మూర్కు చెందిన డీకే.రాజేష్ లయన్స్ క్లబ్ ఉత్తమ రీజినల్ ఛైర్మన్ అవార్డును అందుకున్నారు. సికింద్రాబాద్లోని లయన్స్ భవనంలో గవర్నర్ లయన్ నగేష్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డ్స్ నైట్లో ఈ పురస్కారం ప్రదానం చేశారు. 12 క్లబ్ల పరిధిలో సభ్యత్వ నమోదు, విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆయనను అభినందించారు.
E.G: 70వ సింగారమ్మ జాతర మహోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతర మహోత్సవంలో పాల్గొని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్కు ఆదివారం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో 49,579 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్, తాగునీరు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు.
బాలీవుడ్ నటి అయేషా ఖాన్ పేరు మీద నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి పలువురిని సంప్రదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన అయేషా.. ఆ ఫేక్ చాట్ స్క్రీన్షాట్లను, ఫోన్ నంబర్ను షేర్ చేస్తూ హెచ్చరించింది. ‘ఇది నా అకౌంట్ కాదు, నమ్మకండి’ అని స్పష్టం చేసింది. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు పంపవద్దని ప్రజలను కోరింది.
SRPT: అనారోగ్యంతో మృతి చెందిన అడిగోడు మండలం సిరిపురం గ్రామానికి చెందిన కాంపాటి సాయిలు కుటుంబానికి ఆయన బాల్య మిత్రులు అండగా నిలిచారు. ఆదివారం సాయిలు భార్య జానమ్మకు మిత్రబృందం రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందజేసి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
AP: NTR జిల్లాలో ఆర్గానిక్ రైతు ఉత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. రైతులు వాళ్ల ఉత్పత్తులను వాళ్లే మార్కెట్ చేసేలా.. ఈ పోర్టల్ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోలుదారులు, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆర్గానిక్ ఉత్పత్తిలో జిల్లాను నెం.1గా చేస్తామన్నారు.
BDK: పినపాక పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై సుమారు రూ. 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా వీక్షించి, నిర్మాణ నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానిక గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతుందని తెలిపారు.
TPT: దొరవారిసత్రం నూతన ఎస్ఐగా గరికపాటి వెంకటేశ్వర చౌదరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమై శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మండల పరిధిలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన శ్రీ సంత్ గాడ్గే బాబా మహరాజ్ మూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను సమాజ సభ్యులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమల గౌడ్, రవి నాయక్, మాధవ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
TPT: వెంకటగిరి నియోజకవర్గ YCP సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు 41ఏ నోటీసులు అందజేశారు. గతంలో 27-12-2024న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలపై దుర్భాషలాడారని C.C నాయుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులు గెలుపొందడం పట్ల సేవాలాల్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. షాద్నగర్ పట్టణంలోని సేవాలాల్ కమిటీ సభ్యులు 6వ వార్డు కౌన్సిలర్ రాజునాయక్, దేవుని బండ తండా సర్పంచ్ శ్రీను నాయక్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నచ్చే విధంగా పాలన అందిస్తామన్నారు.
MDK: తూప్రాన్ మండలం యావపూర్లో చేపడుతున్న స్వచ్చ భారత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ స్వచ్ఛ భారత్ పురస్కరించుకుని సర్పంచ్ యంజాల స్వామి పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. అనంతరం వీధులను శుభ్రం చేశారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ యువత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.