తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre)హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానాలు (rains) కూరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నట్టు తెలుస్తోంది.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయనను భార్య అపర్ణ ములాఖత్ సందర్భంగా కలిశారు..
Harish Rao : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈ నెల 8వ తేదీన తెలంగాణ కు రానున్నారు. కాగా.. ఆయన పర్యటన నేపథ్యంలో... మోదీ పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మోదీ పర్యటనపై ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది.
RS Praveen Kumar : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు.
హీరో చైతన్యరావు(Chaitanya Rao)... లావణ్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా రంగమ్మా...రంగమ్మా (Rangamma...Rangamma) అనే పస్టు సింగిల్ను ప్రియదర్మితో విడుదల చేయించారు.'కంటిచూపు నిన్నుతాకి పోనంటుందమ్మా .. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ ..' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హెన్రీ (Prince Henry) సంగీతాన్ని అందించిన ఈ పాటకి శ్రీనివాస మౌళి సాహిత్యాన్ని అందించగా, ఎస్పీ చరణ్(SP Charan) ఆలపిం...
కర్ణాటక (Karnataka) మంగుళురులో దారుణం జరిగింది. ఇంట్లో చేసిన కోడి కూర (Chicken curry) రుచి చూడలేదని కొడుకుని తండ్రి చంపేశాడు. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా(Sheena) కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ (Taste) చూడమని తండ్రి కొడుకును అడిగాడు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు సిటీలో ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) తెలంగాణ పర్యటన సందర్బంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పలు ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 8న హైదరాబాద్కు రానున్నారు. ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) పునురుద్దరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను (Vande Bharat Express) జెండా ఊపి ప్రారంభించనున్నారు.
80 ఏళ్ల వయస్సులో షారుక్ ఖాన్తో కలిసి నటించేందుకు సిద్దమని రాణి ముఖర్జీ తెలిపారు. వీరిద్దరూ కలిసి పలు హిట్ మూవీస్లో నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే.
1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి.