MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చరిత, మాధవి, ప్రవీణ్ పాల్గొన్నారు.
ADB: గర్భిణీ, బాలింత, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని HEO పవార్ రవీందర్ అన్నారు. గురువారం నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు సంతోష్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేటలో ఒంటరిగా కనిపించిన బాలుడి వివరాలు ‘HIT TV’లో వార్తగా రావడంతో తక్షణ స్పందన లభించింది. తమ బిడ్డ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ ఫిరోజ్ సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించగా, తమ బిడ్డ ఆచూకీ తెలిపిన పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా మార్చి 9 తర్వాత పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ మార్కు డైలాగులు సినిమాలో హైలైట్ కానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
SRPT: నడిగూడెంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు ఆరుగురు విద్యార్థులు డుమ్మా కొట్టారు. పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్ విజయ, వాణి పర్యవేక్షించారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రతిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
AKP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం 17 రోజులే ఉందని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే డయల్ యువర్ టీచర్ ప్రోగ్రాం ప్రతిరోజు చేయడానికి సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి ఆరు గంటల నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు.
AP: పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవ్వరికీ నష్టం లేదు అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘సముద్రంలోకి వెళ్లే నీటిని మేం ఉపయోగించుకుంటాం. కాళేశ్వరం గోదావరిపైనే కట్టారు.. నేను అభ్యంతరం చెప్పలేదు. నలమల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదు. మేం కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ వారు కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పొద్దు’ అని పేర్కొన్నారు.
SRPT: నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల గ్రామ పంచాయతీలో పొదుపు మహిళా బృంద సమావేశ మందిర (VO బిల్డింగ్) నిర్మాణానికి గురువారం సర్పంచ్ మరోజు పార్వతమ్మ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, వారి సమావేశాల నిర్వహణకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందన్నారు.
VSP: సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆర్.నల్లకన్ను మరణంపై సీపీఐ జిల్లా సమితి సంతాపం వ్యక్తం చేసింది. జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న జన్మించిన నల్లకన్ను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని తెలిపారు. బడుగు బలహీనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన నిజాయితీకి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.
AKP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.
JGL: జగిత్యాల మున్సిపల్ నూతన ఛైర్ పర్సన్ సమిండ్ల వాణిపై అభిమానాన్ని ఓ వడ్రంగి వినూత్నంగా చాటుకున్నారు. సంగంపల్లికి చెందిన గుగ్గిళ్ల వెంకటేశ్ రెండు రోజుల పాటు శ్రమించి, టేకు కర్రపై ఆమె పేరును అందంగా చెక్కారు. గురువారం ఆ ప్రత్యేక నేమ్ ప్లేట్ను ఛైర్ పర్సన్ను బహూకరించారు. వృత్తిపై మక్కువతో ఆయన చేసిన ఈ పనిని సమిండ్ల వాణి అభినందించారు.
WGL: నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ఇవాళ కౌన్సిలర్లతో కలిసి పట్టణంలోని పలు వార్డులను పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వేసవి కాలంలో పట్టణ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా నూతన బోర్లు వేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
SDPT: కోహెడ మండలం సీసీ పల్లెలో బెజ్జంకి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవల వినియోగం, పొదుపు ప్రాముఖ్యత, బీమా పథకాల వివరాలు ప్రజలకు తెలియజేశారు. కేవైసీ అప్డేట్ అవసరాన్ని వివరించి, సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ మోహన్, సర్పంచ్ సంపత్ పాల్గొన్నారు.
SKLM: దైవచింతన, సేవాభావం రెండు సమాజానికి అవసరమని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి అన్నారు. గురువారం పలాసలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.