కృష్ణా: నేపాల్ రంగసాల ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి చెందిన పవర్ లిఫ్టర్ దుర్గా సత్యనారాయణ 66 కేజీల విభాగంలో 610 కేజీల బరువు ఎత్తి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించాడు. ఈ క్రమంలో ఆయనను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఇవాళ అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
W.G: అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదురు డ్రైన్ ముంపు సమస్యను ఆయన ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికంగా వరదలు రావడం వల్ల సమీపంలోని పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.
NLG: ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు.
NGKL: ఊర్కొండ మండలం జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి రూ.5,000 నగదును అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని ధ్యాప నిఖిల్ రెడ్డి భరోసా ఇచ్చారు.
BDK: ఆళ్లపల్లి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కళ్యాణ లక్ష్మీ, సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ పథకం కింద 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 24,02,784 పంపిణీ చేసి, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించారు.
SDPT: ప్రభుత్వం అందించే పథకాలు,సబ్సిడీలు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కౌన్సిలర్ వనం రమేష్ సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన సోమవారం పరిశీలించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే స్పందించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
GNTR: చట్టసభల విలువైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికతో సభకు హాజరుకావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు.
డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ను నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా కలిశారు. మార్చి 6న హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పెళ్లికి పవన్ కళ్యాణ్ దంపతులను అల్లు అరవింద్ ఆహ్వానించారు. కాగా ఇప్పటికే దుబాయ్లో పార్టీస్, పసుపు దంచుడు వంటి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
MDK: కాళికా మాత ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కాళికా మాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అర్చకులు ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
RR: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్వో సంగీతకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఉన్న జిల్లానే కాకుండా తెలంగాణ ఎర్త్ వైడ్ ఫ్రీ బస్సు పాస్ ఇవ్వాలన్నారు.
AP: రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజులపాటు MLA, MLCలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. అసెంబ్లీ శాసనసభా పక్ష కార్యాలయాల్లో అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. సభ్యులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. క్రికెట్, క్యారమ్స్, చెస్, టెన్నిస్ సహా అనేక ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక పరిహారం అందించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్య సేవలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
VZM: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలు కొత్తవలస భారత్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం సజావుగా జరిగింది. మొత్తం 297 విద్యార్థులు కేంద్రానికి కేటాయించగా, అందులో 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అనారోగ్యానికి బారిన పడకుండా అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ ఇవాళ హైదరాబాదులోని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ను మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్వకుర్తి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.
సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనధికార వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు రాకుండా తనిఖీలు చేపట్టారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.