• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హైదరాబాద్ ఎఫెక్ట్: ఏపీ మళ్లీ మూడు ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉందా?

ఆంధ్రప్రదేశ్ మళ్లీ మూడు ముక్కలు అయ్యేందుకు సిద్ధంగా ఉందా? తెలంగాణ విడిపోయాక ఆయా ప్రాంతాలు అభివృద్ధిని బలంగా కోరుకుంటున్నాయా? హైదరాబాద్ వంటి సిటీ దూరం కావడంతో అందరి మనసు ప్రాంతాభివృద్ధి వైపు మరలిందా? ఎవరు పరిపాలించినా ఒకే ప్రాంతంపై దృష్టి సారించి, తమ ప్రాంతాన్ని గాలికి వదిలేస్తున్నారనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడిందా? అందుకే ఇటీవల ఎవరికి వారు తమకు రాష్ట్రం కావాలని కోరుతున్నారా? అంటే అవుననే వాదనలు...

January 6, 2023 / 04:45 PM IST

కందుకూరు ప్రమాదం… టీడీపీ ఇంఛార్జ్ అరెస్ట్..!

ప్రకాశం జిల్లా కందుకూరులో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో లో… తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా… ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ… టీడీపీ కందుకూరు ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరావుని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయనని కందుకూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూ...

January 6, 2023 / 04:38 PM IST

అయోధ్య రామ మందిరం ప్రారంభించేది అప్పుడే… అమిత్ షా ప్రకటన..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం చాలా మంది కల. దీని కోసం కొన్ని సంవత్సరాల పాటు… చిన్నపాటి యుద్ధాలే జరిగాయి. సుప్రీం కోర్టు తీర్పుతో… సమస్య కొలిక్కి రాగా… మందిరం ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తూనే ఉన్నారు. కాగా…వారంతా ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే మన ముందుకు రానుంది. రామ మందిరం ప్రారంభించే తేదీని… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపుర శాసన ...

January 6, 2023 / 04:34 PM IST

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన రోజా

మెగా సోదరులపై మంత్రి రోజా గురువారం విరుచుకుపడ్డారు. ప్రజలకు చిన్న సాయం కూడా చేయని ఆ కుటుంబాన్ని ఓటర్లు ఎప్పటికి అప్పుడు తిప్పి కొడుతున్నారన్నారు. ప్రజలకు కనీస సాయం చేయలేదు కాబట్టే ముగ్గురిని కూడా ప్రజలు సొంత జిల్లాల్లో ఓడించారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి చంద్రబాబు తప్పులు చేసినప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడని, ఆయన తప్పులు చేసి, ఇబ్బందుల్లో పడినప్పుడు బయటకు వచ్చి మద్దతుగా ని...

January 5, 2023 / 11:23 PM IST

చంద్రబాబు కార్నర్: రాజకీయం కోసం రేవంత్ ఏమైనా మాట్లాడుతారా?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ప్రణాళిక-శిక్షణ కార్యక్రమం బుధవారం బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లను అసహనానికి గురి చేశాయట. సాధారణంగా ఓ పార్టీ నాయకుడిపై మరో పార్టీ నేత విమర్శలు సహజమే. కా...

January 5, 2023 / 11:21 PM IST

కేసీఆర్ కోసం చావడానికైనా సిద్ధం… మంత్రి శ్రీనివాస్ గౌడ్..!

సీఎం కేసీఆర్ కోసం తాము చావడానికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీలో ఏం చదువుకోని వారిని హెల్త్ మినిస్టర్లను చేశారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పట్లో అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని, కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  అన్ని అంశాల మీద పట్టున్న వారికి పదవులు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎలా వస్తావని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస...

January 5, 2023 / 11:17 PM IST

బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు! మాణిక్కం తొలగింపుకు అదే కారణమా?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాకూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను నియమించారు పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. బుధవారం రాత్రి ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్కం ఠాకూర్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం ఇరువర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నది.  మాణిక్కం ఠాకూర్ తొలగింపుకు రేవంత్‌కు...

January 5, 2023 / 11:02 PM IST

రైలు డోర్ వద్ద ప్రయాణం, సారీ చెప్పిన సోనూసూద్

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తాను చేసిన పొరపాటుకు గాను రైల్వే శాఖకు క్షమాపణలు చెప్పారు. నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆ తర్వాత కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. అలాంటి సోనూసూద్ రైలు ప్రయాణంలో డోర్ వద్ద కూర్చొని, బయటకు చూస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఈ రియల్ హీరో ఇలా చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. చాలామంది ఇది […]

January 5, 2023 / 10:53 PM IST

తెలంగాణకు కేంద్రం రూ.5వేల కోట్లు ఇచ్చింది.. కిషన్ రెడ్డి..!

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని… కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ స్కాం పై కూడా ఆయన స్పందించారు.  లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదని అన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదని, ఢిల్లీ లిక...

January 5, 2023 / 10:49 PM IST

పవన్ కళ్యాణ్, లోకేష్‌కు చెక్, అందుకే జగన్‌కు 19 ఫార్ట్యూనర్లతో కాన్వాయ్

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 19 కొత్త SUVలను కొనుగోలు చేసింది. 19 టయోటా ఫార్యునర్ వెహికిల్స్‌లో నాలుగు బుల్లెట్ ప్రూఫ్, మరో రెండు వాహనాలు వీఐపీ సెక్యూరిటీలో భాగంగా జామర్స్ కలిగి ఉంటాయి. ఓ వైపు రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్త కాన్వాయ్ అది కూడా ఏకంగా 19 SUVలు కొనుగోలు చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ 2019లో అధ...

January 5, 2023 / 10:46 PM IST

చంద్రబాబుని హిట్లర్ తో పోల్చిన ఆర్జీవీ…!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విమర్శల వర్షం కురిపించాడు. చంద్రబాబుని హిట్లర్ తో పోల్చి దారుణంగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. జనం ప్రాణాల కన్నా బాబుకు తన పాపులారిటీనే ముఖ్యమని రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన ట్వి...

January 5, 2023 / 10:41 PM IST

ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర డిమాండ్, సంక్రాంతి తర్వాత కొత్త పార్టీ

ఓ వైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రపై చేసిన వ్యాఖ్యలపై వాడివేడి చర్చ సాగుతుండగా, మరోవైపు ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అంటూ నినదించారు. ఇటీవల ధర్మాన మాట్లాడుతూ… చంద్రబాబు అమరావతిలో భూములన్ని కొనేసి, మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని, దీనిని తాము అంగీకరించమని, అమరావతే రాజధానిగా ఉంటే విశాఖ రాజధానిగా ఉత్తరా...

January 5, 2023 / 09:12 PM IST

ఢిల్లీ తరహా హిట్ అండ్ రన్… స్విగ్గీ డెలివరీ బాయ్ బలి..!

ఢిల్లీ హిట్ అండ్ రన్ తరహా సంఘటన మరోటి చోటుచేసుకుంది. నోయిడా లో హిట్ అండ్ రన్ కేసులో…ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. కౌశల్ యాదవ్ అనే స్విగ్గీ ఏజెంట్ ఆ రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కౌశల్ కిందపడిపోగా ఆ కారు సుమారు కిలోమీటర్ దూరం వరకు అతడ్ని లాక్కుపోయింది. తన కారుకు ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు తెలుసుకుని డ్రైవర్ […]

January 5, 2023 / 09:06 PM IST

2023లో అసలు గేమ్: 9 రాష్ట్రాలు బీజేపీకి కీలకం, కేసీఆర్‌కు అసలు పరీక్ష

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2023 సంవత్సరం ఎంతో కీలకం కానుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్యాలెండర్ ఏడాది(2023) అయిన ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలం పార్టీకి కాస్త సానుకూలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏడాదిన్న...

January 5, 2023 / 09:02 PM IST

ఉద్యోగం లేక అబ్బాయిలకు పెళ్లి కావడం లేదు: శరద్ పవార్

దేశంలో యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు.. ఎందుకో తెలుసా? కారణం చెప్పారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఆయన బుధవారం కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెళ్లి వయస్సు వచ్చినప్పటికీ యువకులకు వధువులు దొరకడం లేదని, దీంతో సామాజిక సమస్యలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పుణేలో జన్ జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు....

January 5, 2023 / 08:59 PM IST