నేడు(ఏప్రిల్ 11న) జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. మీరు పెంపుడు జంతువుల యజమాని అయితే దానితో కలిసి సరదాగా గడపండి. లేదంటే మీకు నచ్చిన శునకం లేదా పక్షి సహా ఇతర జంతువులను పెంచుకునేందుకు ఆసక్తి చూపించండి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) పెంచుకుంటున్న శునకం(rhyme) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ నటి సుష్మితా సేన్కు ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యానికి సంబంధించి కో స్టార్ వికాస్ సంచలన విషయం తెలిపారు. జైపూర్లో ఆర్య-3 వెబ్ సిరీస్ షూట్ సమయంలో స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ఆ విషయం తమకు తెలియదని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై మళ్లీ ఎంపీని తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆ క్రమంలో అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది.
భారత స్టాక్ మార్కెట్లు(indian stock market) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 311 పాయింట్లు, నిఫ్టీ 98, బ్యాంక్ నిఫ్టీ సూచీ 532 పాయింట్లు పెరిగి లాభాలతో పూర్తయ్యాయి.
Minister KTR : ఏప్రిల్ 25న ప్రతి గ్రామంలో తమ పార్టీ జెండాలు ఎగరాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈరోజుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ (Smart Phones) వాడకం అత్యవసరమైంది. కరోనా (Corona) మహమ్మారి తర్వాత ఆన్లైన్ క్లాసుల పద్ధతి పెరిగింది. దీంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా యువత (Youth) విపరీతంగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ చాలా సమయం గడుపుతుండటంతో అనేక అనారోగ్య సమస్యలు (Health Problems) ఎదురవుతున్నాయి.
ప్రముఖ అమెరికన్ సంస్థ ఆపిల్ తొలిసారిగా ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) ప్రాంతాల్లో వారి రిటైల్ ఆఫ్ లైన్ స్టోర్లను(Apple offline store) తెరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న BKC స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఒకటి, ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఇంకొటి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఆన్ లైన్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకోవద్దని సైబర్ నిపుణులు/ పోలీసులు పదే పదే చెబుతారు. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ఓ యువతి రూ.9 లక్షలు తీసుకొని.. ఏకంగా రూ.44 లక్షలు కట్టింది.
RK Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ చంద్రబాబు అని రోజా ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికీ వెళ్లి ఏం చేశారో చెప్పగలవా? అని ప్రశ్నించారు.