ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆన్ లైన్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ఫారిన్ కంట్రీ.. అదీ కూడా 6 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి.. మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 175 చోట్ల అభ్యర్థులు బరిలో ఉంటారని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని ఆరోపించారు.
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోన్న 14వ ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. తొలి ఓవర్లో పంజాబ్కు చెందిన ప్రభుసిమ్రాన్ సింగ్ భువనేశ్వర్ కుమార్కు వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్కతా నైట్రైడర్స్(Kolkata night Riders) మధ్య నేడు రసవత్తర పోరు సాగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం(Victory) సాధించింది.
వివాహానికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో వరుడు(bride) వైష్ణవ్ పెళ్లి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వేసవికాలం(Summer Time) వచ్చేసింది. ఎండలు అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఓ వైపు విపరీతమైన ఎండ, మరోవైపు ఉక్కపోత వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. శరీరమంతా వేడి(Heat)గా మారిపోయి ఒక్కోసారి నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. అందుకే శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో పెరుగు(Curd) తినడం వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.
బౌద్ద గురువు దలైలామా పిల్లాడితో విచిత్రంగా బిహెవ్ చేశాడు. పెదవులకు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత తన నాలుక తీసి.. నాకు అని కోరాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సెల్ఫీ విత్ టిడ్కో ఇళ్ల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు(MLC Varudu Kalyani) కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ధైర్యముంటే తాము నిర్మించిన 17 వేల కాలనీల వద్దకు రావాలని కోరారు. అక్కడకు వచ్చి లబ్దిదారులతో సెల్ఫీలు దిగాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ(TDP) హాయంలోనే టిడ్కో ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.
CRPF రిక్రూట్మెంట్ కోసం కంప్యూటర్ పరీక్షలో తమిళాన్ని చేర్చకపోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్(MK Stalin) వ్యతిరేకించారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)కు లేఖ రాశారు. ఆంగ్లం, హిందీ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించాలని కోరారు.
ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోయిందని.. వెతికి పెట్టాలని ఆన్ లైన్లో కంప్లైంట్ చేశారు.
నటుడు గీతానంద్, నేహా సోలంకి యాక్ట్ చేసిన గేమ్ ఆన్(GameOn) చిత్రాన్ని ఈ సమ్మర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా..రవి కస్తూరి నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
ఎలిఫెంట్ విస్సరర్స్ నటులు బొమ్మన్ , బెల్లీని ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపులో మీట్ అయ్యారు. వారితో దిగిన ఫోటోలను మోడీ ఫేస్బుక్లో షేర్ చేశారు.
నటుడు మంచు మనోజ్(Manchu Manoj) తమకు విలువైన గిఫ్ట్ పంపించినందుకు స్టార్ హీరో రామ్ చరణ్(ram charan), ఉపాసన(Upasana) దంపతులకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆయన పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా గిఫ్ట్ ఫొటోలను పంచుకున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.