• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బెస్ట్ పైలట్’ అవార్డులు అందుకుంది వీరే..!

ADB: 102 అంబులెన్సు సేవల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన పైలట్లకు సోమవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న పైలట్లు హరి ఓం, ధన్ సింగ్ల సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పీవో పేర్కొన్నారు.

February 23, 2026 / 04:01 PM IST

‘నూతన బస్టాండ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి’

KMM: ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కలెక్టర్‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు కోరారు. ఖమ్మంలోని నూతన బస్టాండ్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.

February 23, 2026 / 04:01 PM IST

తోటవారిపాలెంలో ఎంపీ కృష్ణప్రసాద్ పర్యటన

BPT: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:00 PM IST

‘పాములు-పర్యావరణ హితకారులు’

ప్రకాశం: పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ విద్యలో భాగంగా ‘పాములు-పర్యావరణ హితకారులు’ అనే అంశంపై సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాము కుట్టినప్పుడు భయపడకుండా తీసుకోవలసిన ప్రథమ చికిత్స గురించి వివరించారు.

February 23, 2026 / 04:00 PM IST

‘విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడండి’

TPT: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నిరంతరం శ్రమించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్‌కు సూచించారు. నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

February 23, 2026 / 04:00 PM IST

ఎంపీపీ స్కూల్ ను సందర్శించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్ ను ఎంపీడీవో ఇమ్రాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పాఠశాలలో హాజరు, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యార్థి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:00 PM IST

ఎస్బీఐ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల ఆందోళన

MNCL: చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట సోమవారం గోల్డ్ లోన్ బాధితులు ఆందోళన నిర్వహించారు. బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. గత ఏడు నెలల నుంచి తమ బంగారం తమకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాధితులకు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:58 PM IST

ATM డైవర్షన్ కేసు నిందితుడు అరెస్ట్

AP: అనకాపల్లి ఏటీఎం డైవర్షన్ కేసును పోలీసులు చేధించారు. ఈ క్రమంలో నిందితుడు మువ్వా వీరయ్యచౌదరిని అరెస్ట్ చేశారు. రూ.15 వేల నగదుతో పాటు 9 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 19 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 03:57 PM IST

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా: పసుపులేటి వీరబాబు

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 21వ వార్డు కార్పొరేటర్ అధ్యక్షతన సుజాతనగర్‌లో నాయకులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గ్రంథాలయానికి కావలసిన మౌలిక వసతులపై చర్చించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని మండల ప్రజల సహకారంతో త్వరలోనే గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:57 PM IST

ఉపాధి హామీ పనులు పునఃప్రారంభం

AKP: పరవాడ మండలం గొర్లవానిపాలెంలో ఈనెల 26వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో రమేష్ నాయుడు తెలిపారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు నిలిపివేయడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సోమవారం ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లారు.

February 23, 2026 / 03:53 PM IST

ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?

KNR: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్‌తో కలిసి 367 దరఖాస్తులు స్వీకరించారు.

February 23, 2026 / 03:51 PM IST

‘బాగా చదువుకుని పెద్ద స్థాయికి ఎదగాలి’

W.G. బాగా చదువుకుని పెద్ద స్థాయికి ఎదగాలి అంటూ మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి గ్రామానికి చెందిన అందె మీనాక్షి అనే విద్యార్థిని చదువుకు అవసరమైన పుస్తకాలు లేక ఇబ్బంది పడుతోంది అని నాయకుల ద్వారా తెలుసుకున్నారు. ఆమెను సోమవారం తణుకు నివాసానికి పిలిపించి ఆమెకు కావాల్సిన పుస్తకాలను స్వయంగా అందించారు.

February 23, 2026 / 03:51 PM IST

కల్తీ పాలు అని ఎలా తెలుసుకోవాలి..?

AP: రాజమండ్రిలో కల్తీపాల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే పాలు కల్తీ జరిగిందని డౌట్ వచ్చినప్పుడు.. కొద్ది పాలను అరచేతిలో వేసి రుద్దాలి. ఎక్కువగా నురగా వచ్చినా.. లేదా చేదుగా అనిపించినా అవి కల్తీ జరిగినట్లే. అంటే ఇందులో యూరియా, డిటర్జెంట్లు, కాస్టిక్ సోడా వంటివి కలిపారని అర్థం. ఒకవేళ పాలు తాగిన తర్వాత ఎవరికైనా మూత్రం సరిగా రాకపోతే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి.

February 23, 2026 / 03:50 PM IST

సఫారీలకు ఒకే స్టేడియంలో ఇన్ని మ్యాచ్‌లా..?

అహ్మదాబాద్ స్టేడియంలో భారత్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. గ్రూప్ దశలో ఇదే స్టేడియంలో మూడు మ్యాచ్‌లు ఆడింది. దీనివల్ల పిచ్ పరిస్థితులపై ఆ జట్టుకు పూర్తి అవగాహన ఏర్పడింది. వెస్టిండీస్‌తో మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. దీంతో, ‘సౌతాఫ్రికా ఒకే స్టేడియంలో ఇన్ని మ్యాచ్‌లు ఆడేలా ICC షెడ్యూల్‌ను ఎలా రూపొందించింది?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

February 23, 2026 / 03:50 PM IST

అంగన్వాడి వర్కర్లు రిలే నిరాహార దీక్ష

CTR: అంగన్వాడి సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ, CITU, IFTU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం అంగన్వాడి వర్కర్స్ ఆధ్వర్యంలో నగరిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతూ.. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:49 PM IST